సీఎం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు !

cm kiran harish raoనీటి ప్రాజెక్టుల గురించి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు.లెక్కలు చూస్తే తెలంగాణకు మరిన్ని నీళ్లు వస్తాయని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తమకు తెలుసని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ… సభలో సీఎం అవాస్తవాలు చెబుతున్నారని, ఆయన సానుభూతి తమకు అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రికి తమపై మాటల్లో ప్రేమే తప్ప, చేతల్లో ప్రేమ లేదని విమర్శించారు.