’టీ’పై మరో వారం రోజుల గడువు!!

tటీ-బిల్లుపై చర్చించేందుకు అసెంబ్లీకి రాష్ట్రపతి మరో వారంరోజుల గడువును పొడిగించారు. జనవరి 30 వరకు టీ-బిల్లుపై చర్చ జరగనుంది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన చేసింది. జనవరి 26 సెలవుకావడంతో.. సభ ఈ నెల 30వరకు సాగనుంది. టీ-బిల్లుపై సభ్యులందరూ మాట్లాడేందుకు వీలుగా మరో 4వారాల గడువు పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్, ప్రభుత్వ కార్యదర్శి మహంతి వేర్వేరుగా రాష్ట్రపతికి, హోంశాఖకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి గడువును మరో వారం రోజులు పొడిగించారు.