ఒక్కొక్కరికి.. 2నిమిషాలే.. !!

telangana-debate-on-ap-asseటీ-బిల్లుపై అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. విభజన ముసాయిదాపై అసెంబ్లీలో చర్చించేందుకు ఈరోజే తుది గడువు. ఈ గడువును మరో వారంరోజులు పొడిగించేందుకు రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారని వార్తలొస్తున్నప్పటికినీ.. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీలో ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాన్ని చెప్పే విధంగా ఒక్కొక్క సభ్యుడికి రెండు లేదా మూడు నిమిషాలు కేటాయిస్తున్న స్వీకర్ నాదెండ్ల ప్రకటించారు. మొదటగా విజయ ప్రసాద్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ప్రశ్నాత్తురాల సమయంలో చర్చించే విధంగా సభలో సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తానని స్వీకర్ తెలిపారు. స్వీకర్ నిర్ణయాన్ని బట్టి చూస్తే.. అసెంబ్లీకి రాష్ట్రపతి గడువును పొడిగించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై మరి కొద్ది గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం వున్నట్లు సమాచారం.