సీఎం.. 450 పేజీల ప్రసంగం!!

kiranఅసెంబ్లీ సాక్షిగా మరోసారి సమైక్యరాగాన్ని ఆలపించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెడీ అయినట్లు తెలుస్తోంది. టీ-బిల్లుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించేందుకు గానూ.. కిరణ్ 450పేజీల ప్రసంగాన్ని సిద్దం చేసుకున్నారు. 8నుంచి10 గంటల పాటు సీఎం ప్రసంగనున్నారు. ఈరోజు (మంగళవారం) లేదా రేపు కిరణ్ ప్రసంగించనున్నారు. జల, విద్యుత్, ఉద్యోగాలు, రాజధాని.. తదితర అంశాలన్ని సీఎం తన ప్రసంగంలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, టీ-బిల్లుపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి రాజీనామా చేయనున్నారనే ప్రచారం కూడా జరిగుతోంది. ఏదేమైనా.. అసెంబ్లీ సాక్షిగా సమైక్య స్టార్ బ్యాట్స్ మెన్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడనున్నారన్న మాట.