నిర్మాత‌గా సందీప్‌కిష‌న్‌

sandeep kishanయువ క‌థానాయ‌కులు చిత్ర నిర్మాణంపై దృష్టి పెడుతున్నారు. మొన్నామ‌ధ్య నాని డీ ఫ‌ర్ దోపిడీ సినిమాలో భాగ‌స్వామిగా మారాడు. ఇప్పుడు సందీప్ కిష‌న్‌కూడా నిర్మాత‌య్యాయి. అయితే సినిమాకి కాదు. ఓ షార్ట్ ఫిల్మ్‌కి. సైలెంట్ మెలోడీ అనే షార్ట్ ఫిల్మ్‌కి నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తున్నాడు సందీప్‌. ఈ ల‌ఘు చిత్రానికి ప్రశాంత్ వ‌ర్మ ద‌ర్శకుడు. త్వర‌లోనే యూ ట్యూబ్‌లో ఈ చిత్రం విడుద‌ల అవుతుంది. ఈమ‌ధ్య యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్‌కి ఆద‌ర‌ణ బాగుంది. చిన్న చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్న ద‌ర్శకులు… ఆ త‌ర‌వాత వెండి తెర‌పై అడుగుపెడుతున్నారు. మ‌రి ప్రశాంత్ వ‌ర్మ కూడా త్వర‌లోనే మెగాఫోన్ ప‌డ‌తాడేమో చూడాలి.