మెగా ఇంటి నుంచి మరో నట వారసుడొచ్చేస్తున్నాడు. తనే సాయిధరమ్ తేజ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం రేయ్. బొమ్మరిల్లు సినిమా పతాకంపై వైవిఎస్చౌదరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సయామీ ఖేర్ కథానాయిక. చక్రి స్వరపరిచిన ఈ చిత్రం ఆడియో ను రేపు (17) విడుదల చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధి గా పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు ‘రేయ్’ ఆడియో ఫంక్షన్ పైనే వుంది. అయితే పవన్ వస్తాడా? రాడా? అన్నది చివరివరకు సస్పెన్స్ అని వినిపిస్తుంది. పవన్ రాక పై క్లారిటీ రావాలంటే మరో కొద్ది గంటలు ఆగితే సరిపోతుంది.