అమ్ ఆద్మీ బాటలో జేపీ

jpలోక్ సత్తా అదినేత నేత జయప్రకాష్ నారాయణ ఆమ్ ఆద్మీ పార్టీ లా స్థానిక సమస్యలపై ప్రత్యక్ష పోరాటానికి సిద్దమవుతున్నారు.ఈ క్రమంలో నగరంలోని హఫీజ్ పేటలోని గోకుల్ ఫ్లాట్స్ లో అక్రమాలను అరికట్టాలంటూ జేపీ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరానికి హాజరై ఎమ్మెల్సీ నాగేశ్వర్ తన సంఘీభావాన్ని ప్రకటించారు. మౌన దీక్ష అనంతరం జేపీ మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ రహదారికి అడ్డంగా ప్రహరిగోడ నిర్మించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజల రాకపోకలకు, వాహనదారులను ఇబ్బందులను గురిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుతిరుగేది లేదని.. తమ పోరాటాన్ని కొనసాగించి తీరుతామని అన్నారు.