క్రేజివాల్ తో జతకట్టనున్న జేపీ… ??

app-loksathaఅవినీతిని చీపురుతో ఊడ్చేస్తామంటూ .. కదం తొక్కింది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రస్తుతానికైతే.. ఢిల్లీలో కాంగ్రెస్ ను ఊడ్చేసింది. ఇప్పుడు దేశంలోని
అన్ని రాష్ట్రాల్లో పాగవేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసేది. ఇందులో భాగంగానే మనరాష్ట్రంలో లోక్ సత్తాతో జతకట్టాలని యోచిస్తున్నట్లు
తెలుస్తోంది. తాజాగా, ఈరోజు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఢిల్లీలో క్రేజివాల్ తో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అంశంపై వీరిద్దరూ కీలక మంతనాలు జరపినట్లు సమాచారం. అయితే, ఆమ్ ఆద్మీ, లోక్ సత్తాల మధ్య భావసారూప్యం వుంది. రెండు పార్టీలు కూడా అవినీతినే ప్రధానాస్త్రంగా చేసుకొని పోరాటాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేయవచ్చన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.