అక్కినేని నాగేశ్వరరావుకి అస్వస్థత, ఆయన పరిస్థితి విషయంగా ఉందని.. మంగళవారం పుకార్లు షికారు చేశాయి. కొంతమంది ట్విట్టర్లలో అక్కినేని నో మోర్ అంటూ సందేశాలు పంపి.. అభిమానుల్ని గందరగోళంలోకి నెట్టారు. అయితే ఈ విషయంపై అక్కినేని కుటుంబం ఈ రోజు స్పందించింది. నాగార్జున ఈ విషయంపై ఓ ప్రకటన విడుదల చేశారు. ”నాన్నగారికి బాగానే ఉంది. ఆయనకేం కాలేదు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఎవ్వరూ నమ్మొద్దు” అంటున్నారు నాగార్జున. ఈ ప్రకటనతో అక్కినేని అభిమానులంతా ఊపిరి పీల్చుకొన్నారు.