సమగ్ర సమాచారం ఇస్తే.. చర్చకు ఓకే.. !!

payyavulaకొత్తగా శాసనసభ వ్యవహారాల బాధ్యతలను చేపట్టిన మంత్రి శైలాజనాథ్ శాసన సభ నిర్వహణకు చర్యలు చేపట్టారు. ఈరోజు (సోమవారం) ఉదయం తెదేపా నేత పయ్యావుల కేశవ్ తో సమావేశమయ్యారు. సభకు సహకరించాల్సిందిగా కోరారు. అయితే, సమగ్ర సమాచారం ఇస్తే.. విభజన బిల్లుపై చర్చకు పయ్యావుల ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అదేవిదంగా ఇతర పార్టీ నేతలతో శైలాజానాథ్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ-బిల్లుపై చర్చ మొదలు పెట్టాల్సిన నేపథ్యంలో.. అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. అసలు ఈరోజైన టీ-బిల్లుపై చర్చ మొదలవుతుందా.. ? లేదా. ? ఎప్పటిలాగే వాయిదాల పర్వం కొనసాగుతుందా.. ? అనేది వేచి చూడాలి