ఓట్ల లెక్కింపు షురూ….కొద్ది గంటల్లో ఫలితాలు !

ashohbabu bhasirఏపీఎన్జీవో సంఘ ఎన్నికలు సాయంత్రం 3 గంటలకు ముగిశాయి. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 835 ఓట్లకు గాను 815 ఓట్లు పోలయ్యాయని అధికారులు తెలిపారు. ఎన్నికల్లో సహకరించిన సహచరులందరికీ రెండు ప్యానెళ్ల అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సమైక్యతకు ఏపీఎన్జీవోలు కట్టుబడి ఉన్నారని వారు వెల్లడించారు. రెండు వర్గాల్లో ఎవరు గెలిచినా ఈ నెల 16 నుంచి 23 వరకు శాసనసభ బయట ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు సాయంత్రం 8 గంటల్లోగా తెలుస్తాయి.