నోట్లో స్వీటు పెట్టి.. కంట్లోకారం చల్లుతున్నారు!

Gandraమంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పుపై టీ-నేతలు బగ్గుమంటున్నారు. కిరణ్ కవ్వింపు చర్యలను మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. తాజాగా, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డి సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ లో గండ్ర విలేకరులతో మాట్లాడుతూ.. నోట్లో స్వీటు పెట్టి.. కంట్లోకారం చల్లినట్లు సీఎం వ్యహరిస్తున్నారని అన్నారు. శాఖలు మార్చి తెలంగాణను అడ్డుకోవాలని కిరణ్ చూస్తున్నారని… ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని గండ్ర అన్నారు. ఈ నెల 23వ తేదిన టీ-బిల్లు పార్లమెంట్ కు వెళుతుందన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు.