తెలుగు ప్రేక్షకులు మరో షాకింగ్ కాంబినేషన్ చూడబోతున్నారు. ఓ కమెడియన్ తో ఓ స్టార్ హీరోయిన్ జత కట్టబోతోంది. ఆ జంట ఎవరో కాదు… శ్రీనివాసరెడ్డి-త్రిష. ఔను.. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో గిలిగింతలు పెట్టిన శ్రీనివాసరెడ్డి త్వరలోనే హీరో అవతారం ఎత్తనున్నాడు. పీవీపీ సంస్థ అతన్ని హీరోగా చేసి ఓ సినిమా రూపొందించడానికి ప్లాన్ చేస్తోంది. కథ ప్రకారం ఈ సినిమాలో ఓ అగ్ర కథానాయిక కావాలి. అందుకోసం త్రిష పేరు పరిశీలిస్తున్నారు. కావల్సిస్తే భారీ పారితోషికం ఇచ్చి… ఒప్పించాలని పీవీపీ సంస్థ భావిస్తోంది. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పెద్ద సంస్థ.. పెద్ద హీరోయిన్… కోత్త హీరో! ఈ కాంబినేషన్ అదుర్స్ కదూ..!