సమైక్యవాదుల అరెస్ట్ – రాష్ట్రపతి టూర్ ఎఫెక్ట్

pranabరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో.. జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భారీగా సమైక్యవాదులను సైతం అదుపులోనికి తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత ప్రజలు రాష్ట్రపతిని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చనే ఆలోచనతో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ ల పర్వానికి తెరలేపినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పోలీసులు సమైక్య ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వివిధ సంఘాలకు చెందిన కీలక నేతలను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలను కూడా పోలీసులు చేపట్టారు. దాదాపు 2000వేల మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేపట్టారు పోలీసు యంత్రాంగం.