తుఫాన్ తరవాత రామ్చరణ్ కొత్త ప్రాజెక్ట్ ఏదీ స్టార్ట్ కాలేదు. ఎవడు విడుదలకు సిద్ధంగా ఉంది. కృష్ణవంశీ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈలోగా కొత్త కథలు వింటున్నాడు చరణ్. రేసుగుర్రం దర్శకుడు సురేందర్రెడ్డితో ఓ సినిమా చేస్తాడని టాక్. ఇప్పుడు ఈ జాబితాలో మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. తనే…. దశరథ్. సంతోషం, నేనున్నాను, మిస్టర్ పర్ఫెక్ట్.. ఇలాంటి సినిమాలతో ఆకట్టుకొన్నాడు దశరథ్. ఇటీవల వచ్చిన గ్రీకువీరుడు బాగా నిరుత్సాహపరిచింది. అయినా ఈ దర్శకుడిపై అగ్ర కథానాయకులు, నిర్మాతలు నమ్మకం ఉంచుతున్నారు. ఇటీవలే దశరథ్.. చరణ్కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకొన్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అలా మొదలైంది నిర్మాత దామోదర ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారని తెలిసింది. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.