రాష్ట్రపతిని కలుస్తాం: కోందండరాం

kodandaramతెలంగాణ బిల్లు వ్యవహారంపై త్వరలో తాము రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియా తో మాట్లాడారు. తెలంగాణ ప్రజల తరపున రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రపతి, స్పీకర్ లకు అఫిడవిట్లు సమర్పించాలని కూడా నిర్ణయించామన్నారు. అటు విభజన బిల్లులో మార్పులు, చేర్పుల అంశాలకు సంబంధించిన అఫిడవిట్లపై తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల సంతకాలు సేకరించాలనుకున్నట్లు వివరించారు. అంతేకాకుండా తాజా పరిణామాలను సభల ద్వారా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు ఆమోదించే బాధ్యత తెలంగాణ మంత్రులదేనని కోదండరాం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.