మంత్రి శ్రీధర్ బాబుపై విద్యార్థిని ఫిర్యాదు!

sridhar-babuరాష్ట్ర ఫౌరసరఫరా శాఖ మంత్రి శ్రీధర్ బాబుపై ఇఫ్ల్యూ విద్యార్థిని కోర్టుకెక్కారు.మంత్రి శ్రీధర్ బాబు, కరీంనగర్ పోలీసులను నుంచి తన భర్త శ్రీనివాస్ కు ప్రాణహాని వుందంటూ ఆమె కోర్టుకు ఆశ్రయించారు. తన భర్తపై పోలీసులు అక్రమ కేసు బనాయించి చిత్రహింసలకు గురి చేశారని, ప్రస్తుతం జైలులో ఉన్న తన భర్తకు తగిన భద్రత కల్పించడంతో పాటు సరైన వైద్యచికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆమె గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.