20న అఖిలపక్షం సమావేశం: అశోక్ బాబు

ashokbabuసమైక్యాంద్రకు మద్దతుగా రాజకీయ పార్టీలతో కలసి చేపట్టాల్సిన ఉద్యమ విధివిధానాలపై చర్చించేందుకు ఈనెల 20న అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఏపీఎన్జీవో భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు, లోక్ సత్తా, ఎంఐఎం పార్టీలను కలసి అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరినట్లు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటానికి అన్ని పార్టీలు రాజకీయాలను పక్కనబెట్టి, కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. అసెంబ్లీలో బిల్లు చించడం, తోటి ఎమ్మెల్యేలపై దాడిచేయడం సరైన చర్య కాదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.