అంబేద్కర్‌ స్పూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన : పయ్యావుల

payyavulaఅంబేద్కర్‌ స్పూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరుగుతుందని టీడీపీ ఎమ్మేల్యే పయ్యావుల కేశవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యంగ స్పూర్తికి వ్యతిరేకంగా తెలంగాణ ముసాయిదా బిల్లు ఉందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక విమానం ద్వారా.. ఈ బిల్లును వెంటనే కేంద్రానికి తిప్పి పంపాలని పయ్యావుల పేర్కోన్నారు. కాగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, ప్రత్యేక విమానం ద్వారా టీ-బిల్లుతో పాటుగా కాంగ్రెస్ అధిష్టానం డబ్బుల కట్టలను కూడా పంపించిందని తెదేపా సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు.