అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే.. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర నేతలు పోటీ మరీ నినాదాలు చేశారు. అయితే, సభలో సమైక్య తీర్మాణం చేయాలని వైకాపా, సీమాంధ్ర తెదేపా నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు, టీ-బిల్లుపై చర్చించాలని బీజేపీ, తెరాస, సీపీఐ లు పట్టుబట్టాయి. సమైక్య, సపరేట్ నినాదాలతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో.. స్వీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.