సమైక్య-సపరేట్ నినాదాలతో దద్దరిల్లిన సభ – రేపటికి వాయిదా

ap assembly sessionsశాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దక్షాణాఫ్రికా మాజీ అధ్యక్షుడు మృతిపట్ల సంతాపం తెలిపిన సభ, ఆయన గురించి అన్ని పార్టీల సభ్యులు కొంతసేపు మాట్లాడారు. అనంతరం కొద్దిసేపు మౌనం వహించారు. ఆ తర్వాత రాష్ట్రంలో మరణించిన ఎమ్మెల్యేల మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. అనంతరం తెదేపా, తెరాస ఏమ్మేల్యేలు పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఇటు తెలంగాణ, అటు సమైక్య నినాదాలతో సభ మర్మోగిపోయింది. దీంతో.. సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్వీకర్ నాందెండ్ల ప్రకటించారు.