అయినా మోజు తీర‌లేదు

sarvanandమంచు విష్ణు, మ‌నోజ్‌, నాని.. ఇప్పటికే నిర్మాత‌లుగా మారారు. శ‌ర్వానంద్ కూడా కో అంటే కోటి సినిమాతో ఆ ముచ్చట తీర్చుకొన్నాడు. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గర ఘెర ప‌రాజ‌యాన్ని ఎదుర్కొంది. కొంత‌కాలం సినిమా నిర్మాణం అనే మాట‌కే దూరంగా ఉన్నారు శర్వానంద్‌. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న నిర్మాత‌గా రంగంలోకి దిగ‌డానికి స‌మాయాత్తం అవుతున్నట్టు స‌మాచార‌మ్. సుదీర్ వ‌ర్మ ద‌గ్గర స‌హాయ‌కుడిగా ప‌నిచేసిన గ‌ణేష్ కి శ‌ర్వా ద‌ర్శకుడిగా చాన్స్ ఇచ్చిన‌ట్టు స‌మాచార‌మ్‌. టాలెంట్ ఉన్నా, విజ‌యాల‌కు దూర‌మైన ఈ హీరో.. నిర్మాత‌గా క‌నీసం రెండో ప్రయ‌త్నంలో అయినా రాణిస్తాడేమో చూడాలి.