మూడేళ్ళలో కిరణ్ చేసింది ఏమిటి ?

cm-kiranవ్యక్తిగత మైలేజీ కోసం పాకులాట తప్పితే… ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రిగా కిరణ్ సాధించింది శూన్యమని ,కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్ల పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న కిరణ్ తెలుగు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆమె నిలదీశారు.

వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చారే కానీ ఒక్కటైనా సక్రమంగా అమలు చేశారా అని రోజా సూటిగా ప్రశ్నించారు. ప్రచారానికి పెట్టిన ఖర్చులో ఒక్క వంతైనా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించారా అని అన్నారు. తెలుగు జాతి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టామంటూ.. సీఎం కిరణ్ ప్రకటనలు సిగ్గుచేటు అన్నారు.