విభజన విషయంలో టీఆర్ఎస్ వైఖరిపై కేంద్రం ఆరా తీస్తోంది. ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై గులాబీ అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది కేంద్రం. ఉమ్మడి రాజధాని, రాయల తెలంగాణ విషయాలపై టీఆర్ఎస్ , టీజేఏసీలు ఏమనుకుంటున్నాయో తెలుసుకునేందుకు కేంద్ర నిఘావర్గాలు రంగంలోకి దిగాయి. కీలక నేతలకు ఫోన్లు చేసి ఆవిషయాలపై వారివారి వైఖరేంటో తెలుసుకుంటున్నాయి.