రాయల తెలంగాణ లేనట్లే.. !

rayala-telanganaరాయల సీమను కూడా తెలంగాణలో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలన్న సీమాంధ్ర నేతల కోరికను కేంద్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపైనే జీవోఎం కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, రాయలతెలంగాణపై రాయలసీమకు చెందిన ఒకరిద్దరు నేతలు తప్ప పెద్దగా ఆసక్తి చూపడం లేదని జీవోఎం భావిస్తోంది. ఒకవేళ డిమాండ్లను బట్టి భవిష్యత్ లో ఆలోచించవచ్చనే ధోరణిలో జీవోఎం రాయల తెలంగాణ అంశాన్ని పూర్తిగా అటకెక్కించింది. కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వారు మొదటి నుంచి రాయలతెలంగాణపై పట్టుబడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ సిద్ధమైన వేళ ఇక రాయల తెలంగాణ లేనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.