తమన్నాకు ‘ఆగడు’ చాలట?

tamannaతన అందాలతో సౌత్ ఆడియన్స్ తో కేక పెట్టించిన చిన్నది తమన్నా…ఇక్కడ టాప్ హీరోయిన్ గా చెలరేగిపోయిన తమన్నా బాలీవుడ్ కి పయనమయ్యింది …అక్కడ ఫర్వలేదు అనిపింవచుకుంటున్న తమ్ము ఇప్పుడు మహేష్ తో మాత్రమే అంటుంది..ఎందుకలా…?

టాలీవుడ్ లో ‘అరెరె అరెరె మనసే జారే’ అంటూహ్యాపీ ట్యూన్స్ పాడింది తమన్నా . సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన మిల్క్ బ్యూటీ… ఎప్పుడూ ఇక్కడే అయితే ఎలా? అనుకందేమో హిందీ సినిమా పరిశ్రమకు లగెత్తింది. కాని కాలం కలసి రాలేదు…‘హిమ్మత్ వాలా’ చిత్రం ఫ్లాపైంది. కానీ తమన్నా గ్లామర్‌, పెర్ఫార్మెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కాని బాలీవుడ్ లో తమన్నాకు సో సో అవకాశాలే దక్కాయి. బాలీవుడ్ లో ఊహించిన క్రేజ్ లభించకపోయేసరికి తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అవకాశాన్ని మిస్ అయినందుకు తెగ బాధపడిపోతోందిట..అందుకే ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్‌పై కన్నేసింది. తెలుగులో నిలదొక్కుకోవాలంటే మహేశ్ బాబు ఒక్కడే తనకు దిక్కని భావించింది. అందుకే ఆగడు ఆఫర్ వచ్చిన వెంటనే ఓకే చెప్పేసింది.

ఇక టాలీవుడ్ కొంచం ఫేమ్ తగ్గిన తమన్నా, చిత్రాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కథ, హీరో, దర్శకుడు లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. మహేష్ బాబు లాంటి స్టార్స్ తో తప్ప మరెవరితోనూ వద్దంటుంది. అయినా… సరియైన హిట్ దానికి తగ్గ ఫేమ్ రావాలంటే ఈ ‘ఆగడు ‘ చాలు కదా..