క్రేజీవాల్.. నా పేరు వాడొద్దు.. !

arvina-keejrevalఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ క్రేజీవాల్ పై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే అన్నా ’జనలోక్ పాల్ బిల్లు’ను తీసుకొస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం పట్ల అన్నా హజారే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో నా పేరు వాడుకోవడం సరికాదని అన్నా అన్నారు. అయితే, ఇప్పటికే జనలోక్ పాల్ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చిందని, ఈ విషయంలో ఢిల్లీ అసెంబ్లీ ఏమి చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఏ పార్టీ కూడా తన పేరును ఉపయోగించుకోవడం తనకిష్టం లేదన్న హజారే.. తాను ఏ పార్టీతోనూ భాగస్వామికానని స్పష్టం చేశారు. కాగా, అవినీతిపై పోరాటం చేసే సమయంలో క్రేజీవాల్, అన్నా హజారే కలసి ఉద్యమంలో పాల్గొన్నారు. తదనంతరం క్రేజీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.