మంచు వారి మల్టీస్టారర్ పాండవులు, పాండువులు తుమ్మెద తుది మెరుగులు దిద్దుకొంటోంది. మోహన్బాబు, విష్ణు, మనోజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. వరుణ్సందేశ్, తరుణ్ కూడా నటిస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలవడానికి సన్నద్ధం అవుతోంది. ముగ్గుల పండక్కి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. డిసెంబరు మొదటి వారంలో పాటల్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ”సంక్రాంతికి వస్తే.. బాగుంటుంది అనుకొంటున్నాం. ఎందుకంటే కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా ఇది సినిమాలోనూ పండగ వాతావరణం ఉంటుంది. అందుకే పండక్కి ఇది పర్ఫెక్ట్ మూవీ” అని విష్ణు చెబుతున్నాడు.