రాజకీయం కోసం రాష్ట్రాన్ని విభజిస్తారా ?!

lagadapatiరాజకీయ అవసరాలకోసం రాష్ట్రాన్ని విభజిస్తారా? అంటూ విజయవాడ ఎంపీ లగడపాటి ప్రశ్నించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ హోటల్లో జరిగిన ఏపీ జర్నలిస్ట్ ఫోరం సమావేశంలో లగడపాటి మాట్లాడుతూ… దత్తపుత్రుడు, వేర్పాటు పుత్రుడుతో కలసి కాంగ్రెస్ అధిష్ఠానం ముందుకు వెళ్తుందని మేమే ఊహించలేకపోయామని వాపోయారు. విభజనపై ఒక జాతీయ విధానమంటూ ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని హైకమాండ్ కు చెప్పామన్నారు. సమైక్యవాదమే గెలుస్తుందని భావిస్తున్నామన్నారు. హైదరాబాద్ తో అందరికీ అనుబంధం ఉందన్నారు. ఏపీ విభజనను దేశం మొత్తం గమనిస్తోందన్నారు.