టి.కాంగ్రెస్ నేతల ‘జీవోఎం’ కసరత్తు

meetరేపు జీవోఎం ఎదుట ప్రస్తావించిన అంశాలపై చర్చిచేందుకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు బలరాంనాయక్, సర్వే సత్యనారాయణ హాజరయ్యారు. వీరితో పాటు జానా, పొన్నం, శ్రీధర్ బాబు, భట్టి తదితరులు హాజరయ్యారు. జీవోఎం నివేదిక, సి.ఎం కిరణ్ ధిక్కార వ్యాఖ్యలు, హైదరాబాద్, భద్రాచలం అంశాలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.రేపు 11 గంటలకు జీవోఎం ముందు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలుసమావేశం కానున్నారు.