కేశవ్ కొత్త ప్లాన్ !

payyavula keshavరాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు కొత్తప్లాన్ కనుగొన్నారు తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారానే.. సమైక్య రాష్ట్రాన్ని నిలబెట్టగలమని పయ్యావుల పేర్కొన్నారు. అందుకు.. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని కూడా ఆయన సూచించారు. ఈరోజు హైదరాబాద్ లో పయ్యావుల విలేకరులతో మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాం.. సమైక్యరాష్ట్రాన్ని నిలబెడదాం” అని పిలుపునిచ్చారు. ఇదొక్కటే.. ఇప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచగలదని ఆయన అన్నారు. మరి పయ్యావుల ప్లాన్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.