జీవోఎం ముందుకు కిరణ్ !

cm kirananరాష్ట్ర విభజనపై మంత్రుల బృందం ఎదుట హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పిలుపు వచ్చింది. రేపు రాత్రి 8గంటలకు కిరణ్ జీవోఎంతో సమావేశం కానున్నారు. అయితే, ఇప్పటికే జీవోఎం అయిదు పార్టీలతో చర్చించిన విషయం తెలిసిందే. ఈరోజు మరో రెండు పార్టీలు తెదేపా, సీపీఎం జీవోఎం ముందు హాజరుకావాల్సి వుండగా.. ఈ రెండింటిలో తెదేపా జీవోఎంతో సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. అయితే, విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కేంద్రం పక్కకు పెట్టిందనే వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో.. జీవోఎం నుంచి సీఎంకు పిలుపురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరీ….. సీఎం మరోసారి సమైక్యవాదాన్ని వినిపిస్తారా.. ? లేదా సీమాంధ్రకు కేటాయింపులపై సూచనలు చేస్తారా వేచు చూడలి.