కోర్టుకెక్కిన ’వర్మ’

ramgopal-varmaసెన్సార్‌పై సమరానికి సిద్ధమయ్యాడు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈరోజు (సోమవారం) ’సత్యా-2’ సినిమా సెన్సార్‌ పై నాంపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశాడు వర్మ. ’సత్యా-2’ సినిమాకు సెన్సార్ అనుమతులివ్వకుండా సెన్సార్‌ బోర్డు సభ్యురాలు ధనలక్ష్మి ఇబ్బంది పెడుతున్నారని వర్మ ఆరోపించారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘సత్య-2’ సినిమాకు సంబంధించి మొదటగా ముంబాయిలో సెన్సార్ కంప్లీట్ చేసుకుండి. అదే తెలుగులో సెన్సార్ చేసేప్పుడు ముంబాయి సెన్సార్ బోర్డు ఓకే చేసిన సన్నివేశాలను సైతం కట్ చేశారని వర్మ ఇటీవల ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలపిన విషయం తెలిసిందే. కాగా, వర్మ పిటిషన్ కు ఆయన శిష్యగణం (వర్మ బ్యాచ్) కూడా మద్దతు తెలిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.