సోనియాతో కన్నా భేటీ

kanna soniaకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ భేటీ అయ్యారు. ఈ ఉదయం అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో రచ్చబండ కార్యక్రమం రద్దు చేసుకుని మరీ కన్నా ఢిల్లీ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, విభజన అనంతరం సీమాంధ్ర పీసీసీ అధ్యక్షునిగా కన్నాను నియమించే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరైతే.. కిరణ్ ప్లేస్ లో కన్నాను తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా.. విభజన నేపథ్యంలో.. కన్నా, సోనియాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.