బిల్లు మాత్రమేనట.. !

Botsa-Satyanarayana1తనకున్న అవగాహన మేరకు అసెంబ్లీకి తెలంగాణ బిల్లు మాత్రమే వస్తుందని.. తెలంగాణ అంశంపై తీర్మానం కూడా కావాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తామని పీసీసీ చీఫ్‌ బొత్స అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా సి. డబ్య్లు.సి తీర్మానాన్ని అంగీకరిస్తున్నామన్న ఆయన.. తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతానని చెప్పారు. మరోవైపు మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం బస్సు ప్రమాద ఘటనలో యాజమానులైన దివాకర్‌ రోడ్‌ లైన్స్‌ కేసు నమోదైందని తెలిపారు. ప్రమాద మృతులకు ఇంకా ఎక్స్‌గ్రేషియా నిర్ణయించలేదన్న బొత్స.. త్వరలోనే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.