సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నా: కావూరి

Kavuriతానిప్పటికీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం విడిపోతే ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి పొందవచ్చననే అభిప్రాయంతోనే, విభజన కోసం కొందరు స్వార్థపరులు పోరాడుతున్నారని ఆరోపించారు. భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలలో కావూరి పర్యటించారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. టీఆర్ఎస్, వైసీపీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తాను తీవ్రంగా వ్యతిరేస్తానని ఆయన తెలిపారు.