చిరుకు చేదు అనుభవం!

chiruసీమాంధ్ర జిల్లాల్లో సమైక్య నిరసనలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. చిరుపై కొందరు సమైక్యవాదులు రాళ్లతో దాడి చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు (మంగళవారం) విజయనగరం జిల్లా రాజాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరద బాధితులను చిరంజీవి పరామర్శించి తిరిగి వచ్చి కాన్వాయ్ ఎక్కుతుండగా సమైక్యవాదులు రాళ్లు విసిరారు. వెంటనే.. మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు. ఊహించని సంఘటనతో.. హవాక్కయిన చిరు పోలీసుల సహాయంతో.. అక్కడి నుండి బయటపడ్డారు.