బొత్స నివాసంలో మంత్రాంగం!

botsaవిజయనగరంలోని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసంలో కేంద్ర మంత్రి చిరంజీవితో పాటు.. పలువురు రాష్ట్ర మంత్రులు సమావేశమయ్యారు. విజయనగరం జిల్లాలో జరిగిన వరదనష్టంపై చర్చించారు. అయితే, పైకి జిల్లాలో వరదముంపుకు గురైన ప్రాంతాలపై చర్చించినట్లు చెబుతున్నప్పటికినీ.. తాజా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజజీయ పరిణామాలు, ముఖ్యంగా కిరణ్ వైఖరిపై వీరు చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి, ఏరాసు ప్రతాపరెడ్డిలు కూడా పాల్గొన్నారు.