కిరణ్ లెటర్ గురించి నాకు తెలీదు !

digvijyasingముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి..రాష్ట్ర విభజనపై శాసనసభకు తీర్మానం పంపే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి మూడు పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖ విషయం పై తన శైలి లో స్పందించారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. దిగ్విజయ్ తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..కిరణ్ లేఖ విషయం తనకేమీ తెలియదని తాపీగా సమాధానమిచ్చారు. మీడియా హడావిడి తప్ప లేఖ గురించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదని తేల్చి చెప్పేశారు దిగ్విజయ్.