పీఎం కార్యాలయ అధికారులతో గవర్నర్ భేటీ !

governarరాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ రెండో రోజు కూడా ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఈ ఉదయం ప్రధాని కార్యాలయ ఉన్నతాధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. అంతకుముందు, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా గవర్నర్ ఈరోజు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కాగా, నిన్న నరసింహన్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేలతో పాటుగా, పలువురు ప్రముఖులతో సమావేశమయిన విషయం తెలిసిందే.