కేంద్ర ప్రభుత్వ తీరు బాధకలిగిస్తోంది !

ashokbabuకేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి తమకు బాధ కలిగిస్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ .. ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. అయితే తీర్మానం అసెంబ్లీకి వచ్చే అంశం పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.