’మహబూబ్ నగర్’ బరిలో రాహుల్.. !

dk arunaఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీని మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని కోరామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డికె అరుణ తెలిపారు. ఢిల్లీ వెళ్లిన అరుణ ఇదే విషయాన్ని పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ తో చెప్పినట్లు తెలియజేశారు. ఢిల్లీలో ఈ రోజు ఆమె దిగ్విజయ్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత తమ ప్రాంత ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగిందని ఆమె అన్నారు. అంతేకాకుండా.. ఇటీవల తెలంగాణ జిల్లాలో నిర్వహిస్తున్న జైత్రయాత్ర సభల గురించి కూడా ఢిగ్గీరాజాకు వివరించినట్లు ఆమె వెల్లడించారు. మరి.. గద్వాల్ రాణి కోరికను కాంగ్రెస్ హైకమాండ్ తీరుస్తుందా.. ? లేదా..? వేచి చూడాలి.