మరోసారి రాజీనామా లేఖలు.. !

lagadapatiరాజీనామాను ఆమోదింపజేసుకునేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తునే వున్నారు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్. తాజాగా, లగడపాటి మరోసారి తన రాజీనామా లేఖను లోక్ సభ సెక్రెటరీ జనరల్ కు అందజేసారు. ఈ సందర్భంగా లగడపాటి విలేకరులతో మాట్లాడుతూ.. తన రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారని భావిస్తున్నాని తెలిపారు. రాజీనామా విషయంలో ఎవరి ఒత్తిళ్ళు లేవని స్వచ్ఛందంగానే రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, రాజమండ్రి ఎంపీ వుండవల్లి అరుణ్ కుమార్ కూడా తన రాజీనామా లేఖను లోక్ సభ సెక్రెటరీ జనరల్ అందించారు. కాగా, విభజనకు నిరసనగా రాజీనామా చేసిన 13మంది సీమాంధ్ర ఎంపీల రాజీనామాలను ఇటీవలే స్వీకర్ మీరాకుమార్ తిరస్కరించిన విషయం తెలిసిందే.