ఫైలీన్ తుఫానును ఆపలేక పోయాం కానీ విభజన తుఫాను ఆపుతాం అందుకు ప్రజల సహకారం కావాలని సీఎం కిరణ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫైలీన్ తుఫాను ప్రాంతంలో సీఎం పర్యటించారు.తుఫాను బాధితులపు ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. లక్షా 35 వేల మందిని తుఫాన్ నుంచి కాపాడినట్లు కిరణ్ తెలిపారు. నష్టపోయిన వారికి 10వేల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని … కొబ్బరి రైతులకు ఇచ్చే పరిహారాన్ని పెంచాతామని సీఎం స్పష్టం చేశారు. పూర్తి నివేదిక వచ్చిన తరువాత నష్టపరిహారం ఎంతో చెబుతామని సీఎం కిరణ్ వివరించారు.