రాజీనామా ఆమోదింపజేసుకోవడం నాహక్కు

lagadapatiకేంద్ర ప్రభుత్వం మైనారిటీలో ఉందన్నారు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్. తన రాజీనామా లేఖను ఆమోదింపజేసుకునేందుకు ఆయన ఢిల్లీ వచ్చారు. ఎంపీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కోరారు. ప్రజాప్రతినిధిగా తనకు రాజీనామా చేసే హక్కుందని, వెంటనే ఆమోదించాలని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లగడపాటి.. కేంద్ర ప్రభుత్వంతో తమకిక సంబంధం లేదని, రాజీనామాలు ఆమోదింపజేసుకోవడమే తమకు ముఖ్యమని తెలిపారు