ఈసారైనా.. ఫలించేనా.. ?

CM-Kiran-Kumar-Reddy-Call-List-leakage......1ఏపీ ఎన్జీవోలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు (బుధవారం) మరోసారి సమావేశం కానున్నారు. ఎంతో కీలకమైన ఈ భేటీకి ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు కూడా హాజరవుతున్నారు. నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్న నేపథ్యంలో.. చర్చల తర్వాత ఉద్యోగుల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ముఖ్యమంత్రిని స్పష్టమైన హామి లభిస్తేనే సమ్మె విరమణపై ఆలోచిస్తామని ఏపీ ఎన్జీవోలు స్పష్టం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే మంత్రి వర్గ ఉప సంఘంతో ఉద్యోగులు రెండు సార్లు చర్చలు జరిపినప్పటికినీ ఎలాంటి ఫలితంరాని విషయం తెలిసిందే. ఎంతో కీలక భేటీగా భావిస్తున్న ఈ సమావేశంలోనైనా.. చర్చలు ఓ కొలిక్క వస్తాయోమో వేచి చూడాలి.. !