సీఎంను బర్తరఫ్ చేయండి !

cm kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని తెరాస నేతలు గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈరోజు (బుధవారం) ఉదయం తెరాస ఎమ్మెల్యేల బృందం గవర్నర్ తో సమావేశమయి వినతి పత్రాన్ని అందజేశారు. డీజీపీ దినేష్ రెడ్డి సీఎం కిరణ్ పై చేసిన వ్యాఖ్యలను పరిగణలోనికి తీసుకొని ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నకు అందజేసిన వినతిపత్రంలో ఎమ్మెల్యేలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా, ముఖ్యమంత్రి సమైక్యవాదాన్ని బలపర్చే విధంగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. నక్సల్ సమస్య పెరగే ప్రమాదముందని మీడియాతో చెప్పాలని ఒత్తిడి తెచ్చేవారని దినేష్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.