నేటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన !

Manmohan-Singh_1438480cప్రధాని మన్మోహన్ సింగ్ ఈరోజు (బుధవారం) విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. బ్రూనే, ఇండోనేషియాలో ప్రధాని నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆగ్నేసియా దేశాలతో భద్రత, సాంస్ర్రృతిక సాహకారం పెంపొదించుకోవడమే ప్రధాని పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నెల 10న బ్రూనేలో జరగనున్న ఆగ్నేసియా దేశాల సంఘం-భారత్ శిఖరాగ్ర సమావేశం, అనంతరం విదేశీ వ్యవహారాల సల్మాన్ ఖుర్షీద్, పరిశ్రమల మంత్రి ఆనంద్ శర్మలతో కలసి ప్రధాని ఇండోనేషయాలో పర్యటిస్తారు. బ్రూనేలో మన్మోహన్ ఆస్ట్రేలియా ప్రధాని టోని అభాట్ తో సమావేశమయి యురేనియం అమ్మకంపై చర్చించనున్నారు. ఈ యేడాది చివరికల్లా ఆగ్నేసియా దేశాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు చేసుకునే ప్రయత్నాల్లో వుండటంతో.. ప్రధాని విదేశీ పర్యటన మరింత ప్రాధ్యాన్యతను సంతరించుకుంది.