సమ్మెను విరమించండి..!

digvijayఏపీ ఎన్జీవోలు సమ్మెను విరమించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్వజయ్ సింగ్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢీల్లీలో దిగ్విజయ్ ఈరోజు విలేకర్లతో మాట్లాడుతూ.. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఆస్పత్రులు, రైల్లు, ఇతర రంగాల్లో విద్యుత్ నిలిచపోయి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల పడుతున సమస్యలను దృష్టిలో వుంచుకొని సమ్మెను విరమించాలని ఆయన పేర్కొన్నారు. కాగా, తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని దిగ్గీ రాజా మరోసారి స్పష్టం చేశారు.