తడాఖాతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు నాగ చైతన్య. ఆ సినిమాతో మాస్కి మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడో ప్రేమ కథ చేయబోతున్నాడు. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో తొలి అడుగులోనే హిట్ సాధించిన కొండా విజయ్కుమార్.. ఇప్పుడు చైతూతో జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ లవ్ స్టోరీ రానుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంచుకొన్నట్టు సమాచారమ్. పూజా ఇది వరకు మాస్క్ అనే సినిమాలో నటించింది. జీవా కథానాయకుడు. తెలుగులో నేరుగా చేయబోయే చిత్రం ఇదే. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది.